బీఆర్ఎస్, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ ఆడుతున్నాయి: బీజేపీ ఎంపీ
![బీఆర్ఎస్, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ ఆడుతున్నాయి: బీజేపీ ఎంపీ](https://www.telugutimes.net/storage/news/news_new_71871.jpg)
త్వరలో కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధ్యం కాబోతోందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో ఎటు చూసినా, ఏ సర్వే పరిశీలించినా బీజేపీ ప్రభంజనమే కనిపిస్తోందని, కనుచూపు మేరలో కాంగ్రెస్ ఎక్కడా గెలిచేలా కనిపించడం లేదని తేల్చిచెప్పారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటూ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసే ప్రయత్నం చేస్తోంది. దాదాపు 12 రాష్ట్రాల్లో ఆ పార్టీ కనీసం ఒక్క సీటు కూడా గెలవలేని పరిస్థితిలో ఉంది.
ఇక దేశ వ్యాప్తంగా కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావంటూ ఇండియా కూటమిలోని టీఎంసీ అధినేత మమతా బెనర్జీనే స్వయంగా అంటున్నారు. అంటే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా ఆ పార్టీని గౌరవించడం లేదన్నమాట’’ అంటూ హస్తం పార్టీపై లక్ష్మణ్ ధ్వజమెత్తారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ ఆడుతున్నాయన్న లక్ష్మణ్.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం అవస్థలు పడుతోందన్నారు. ఇక ఆ పార్టీ నేతల మధ్యే పొసగడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అభద్రతా భావంలో కొట్టుమిట్టాడుతున్నారని ఆరోపించారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)