ఎంపీ కలిశెట్టి అమరావతికి విరాళంగా.. తొలి వేతనం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన తొలి నెల గౌరవ వేతానాన్ని విరాళంగా ఇచ్చారు. పార్లమెంటు నుంచి తొలిసారిగా అందిన గౌరవ వేతనం రూ. 1.57 లక్షల చెక్కును ఢల్లీిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీ పర్యటనకు వచ్చిన చంద్రబాబు నాయుడును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్వయంగా కలిసి రూ.1.57 లక్షల చెక్కు నుందించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో తాను తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 4న అందిన తన తొలి నెల గౌరవ వేతనం రూ.1.57 లక్షల చెక్ను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసినట్లు వెల్లడించారు.
Tags :