ASBL Koncept Ambience
facebook whatsapp X

మహ్మద్‌ సిరాజ్‌ ను సన్మానించిన సీఎం రేవంత్‌ రెడ్డి

మహ్మద్‌ సిరాజ్‌ ను సన్మానించిన సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని భారత క్రికెటర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు టీమ్‌ ఇండియా జెర్సీని బహుకరించారు. టీ20 ప్రపంచకప్‌ సాధించినందుకు సిరాజ్‌ను ముఖ్యమంత్రి అభినందించారు. సిరాజ్‌కు హైదరాబాద్‌లో ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. హైదరాబాద్‌ పరిసరాల్లో  స్థలం గుర్తించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజహరుద్దీన్‌ పాల్గొన్నారు. 

ఇటీవల టీ20 ప్రపంచకప్‌ సాధించిన భారత జట్టులో సిరాజ్‌ ఉన్నారు. ప్రపంచకప్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత హైదరాబాద్‌ వచ్చిన అయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో ఓపెన్‌టాప్‌ వాహనంపై వస్తూ ఆయన పాట పాడి అభిమానుల్లో జోష్‌ పెంచారు. 
 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :