ప్రపంచ స్థాయిలో ఉద్యోగాలు సాధించేలా : మంత్రి శ్రీనివాస్
గత ఐదేళ్లలో నైపుణ్య శిక్షణపరంగా రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయనగరంలోని టీటీడీసీ శిక్షణా కేంద్రం, జిల్లా సమాఖ్య కార్యకలాపాలను ఆయన పరిశీలించారు. యువతీయువకులు ఉద్యోగాలు పొందిన తీరు, ఉపాధి అవకాశాలు కల్పించిన సంస్థల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లు ఇంజినీరింగ్ కళాశాలల్లో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పూర్తిగా నిలిపివేశారు. నైపుణ్యం ఉన్న యువతకు మంచి డిమాండ్ ఉంది. ఈ విషయంలో ప్రైవేటు సంస్థలు ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఉద్యోగావకాశాలను కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రపంచ స్థాయిలో ఉద్యోగాలు సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నాం అని తెలిపారు.
Tags :