గత ప్రభుత్వం విస్మరించినా.. కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆమోదం : మంత్రి సత్యకుమార్
పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంలో పోలవరం గురించి పోరాడింది బీజేపీనే. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసి ఖర్చులను 90 శాతం కేంద్రం, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేలా చేసింది బీజేపీ నాయకత్వమే. ముంపు మండలాలపై తొలి క్యాబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుంది. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయడం కోసం మా పార్టీ పూర్తి సహకారం అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరాన్ని అతి త్వరగా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
గత ప్రభుత్వ చేతగాని తనం, ప్రాజెక్టును ఆదాయ వనరుగా మార్చుకోవడం వల్ల డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం తెలిసిందే. దాన్ని ఎలా సరిచేయాలనే విషయంపై నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. పోలవరం పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. అమరావతిపై కూడా జగన్ వికృత రాక్షస క్రీడకు శ్రీకారం చుట్టారు. అమరావతి రాజధానిగా ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. అవుటర్ రింగ్రోడ్డును గత ప్రభుత్వం విస్మరించినా కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆమోదం తెలిపింది. కనెక్టివిటీ పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే ప్రాజెక్టు అది. దాని ద్వారా రాష్ట్రానికి ఆదాయం, జీఎస్టీ వస్తుంది అని అన్నారు.