ASBL NSL Infratech

షర్మిల కు టార్గెట్ ఇచ్చిన రోజా.. షర్మిల కే టార్గెట్ అవుతుందేమో..

షర్మిల కు టార్గెట్ ఇచ్చిన రోజా.. షర్మిల కే టార్గెట్ అవుతుందేమో..

ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వరల్డ్ వార్ కంటే భయంకరమైన వర్డ్ వార్ ఎక్కువైపోతుంది. నిజానికి ఆంధ్రాలో నిన్నటి వరకు వైసీపీ బలగం వర్సెస్ టిడిపి అండ్ కో గా సాగింది. అయితే ఇటీవల ఈ రేస్ లో వైఎస్ షర్మిల దిగడంతో.. ఈ మాటల యుద్ధం ఇప్పుడు త్రిముక పోరుగా మారింది. వైయస్ షర్మిల వంటి చేత్తో రూలింగ్ పార్టీని ఉతికి ఆరేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా.. తనదైన స్టైల్ లో రిటర్న్ ఇచ్చింది. అంతేకాకుండా వైయస్ షర్మిల కి ఓ కొత్త పని కూడా అప్పగించింది.

కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి షర్మిల టార్గెట్ ఒక్కటే.. జగన్ ని ఏకిపారేయడం. అయితే ఈ నేపథ్యంలో ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి. జగన్ లక్ష్యంగా.. వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ ఆమె అంటున్న విమర్శలు బాగా శృతిమించుతున్నాయి. అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబానికి ఎటువంటి అన్యాయం చేయలేదు అని షర్మిల అన్న మాటలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి.

ఒకప్పుడు జగన్ ని జైల్లో పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీపై దారుణంగా విమర్శలు చేసింది షర్మిలే కదా..అని ఈ నేపథ్యంలో కొందరు పాత విషయాలను గుర్తు చేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్ ని సపోర్ట్ చేయడం వైఎస్ ఫ్యామిలీ అభిమానులకు రుచించడం లేదు. ఆ విషయం పక్కన పెడితే తాజాగా షర్మిలపై రోజా మరొకసారి తన స్టైల్ లో రెచ్చిపోయింది. ఈ నేపథ్యంలో షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీని మూసేసి ఆంధ్రకు వచ్చిందని రోజా అన్నారు.

అన్నను జైల్లో పెట్టించిన పార్టీతో షర్మిల చేతులు ఎలా కలిపింది అంటూ మొదలు పెట్టిన రోజా.. ఏపీలో కాంగ్రెస్ తరపున పర్యటన చేస్తున్న షర్మిల.. జగన్ పై చేస్తున్న విమర్శలను తప్పు పట్టింది. ఏ ప్రయోజనం కోసం కాంగ్రెస్ తరపున షర్మిల ఆంధ్రలో ప్రచారం చేస్తుందో చెప్పాలి అంటూ డిమాండ్ కూడా చేసింది. అంతేకాకుండా చేతనైతే తెలంగాణ నుంచి ఆంధ్రకు రావలసిన 6 వేల కోట్లు ఇప్పించమంటూ షర్మిలకు పెద్ద సవాలే విసిరింది. మరి షర్మిలక్క దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :