అమెరికాలో మెగాస్టార్ చిరంజీవికి సన్మానం
![అమెరికాలో మెగాస్టార్ చిరంజీవికి సన్మానం](https://www.telugutimes.net/storage/news/news_new_68854.jpg)
అమెరికా పర్యటనలో ఉన్న మెగాస్టార్ చిరంజీవిని అక్కడి అభిమానులు సన్మానించారు. ఇటీవల ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లాస్ ఏంజిల్స్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నాకొచ్చిన ఈ అవార్డును మీకొచ్చినట్లుగా భావించడం చాలా సంతోషంగా ఉంది. పురస్కారం వరించినప్పుడు ఆనందమే. ఆ గుర్తింపు వల్ల నాతోపాటు మీరంతా హ్యాపీగా ఉన్నారు. ఇంతకుమించిన అవార్డేముంటుంది అని పేర్కొన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :