అమెరికాలో రామ్మందిర్ రథయాత్ర
![అమెరికాలో రామ్మందిర్ రథయాత్ర](https://www.telugutimes.net/storage/news/news_new_70471.jpg)
అమెరికా, కెనడాల్లో చేపట్టనున్న రామ్మందిర్ రథయాత్రను ఈ నెల 25న చికాగోలో ప్రారంభించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ అమెరికా ( వీహెచ్పీఏ) తెలిపింది. మొత్తం 48 రాష్ట్రాల మీదుగా అరవై రోజులపాటు 8,000 మైళ్లకు పైగా ఈ యాత్ర కొనసాగనుంది. రథంలో సీతారాములు, లక్ష్మణ, హనుమాన్ విగ్రహాలతో పాటు అయోధ్య రామమందిర ప్రత్యేక ప్రసాదం, కలశం, అక్షింతలు ఉంటాయని వీహెచ్పీఏ ప్రధాన కార్యదర్శి అమితాబ్ మిత్తల్ తెలిపారు. అమెరికాలో 851, కెనడాలో 150 ఆలయాలు ఈ సందర్భంగా సందర్శించనున్నట్లు వెల్లడించారు. ఈ యాత్ర హనుమాన్ జయంతి రోజైన ఏప్రిల్ 23న ఇల్లినాయిస్లోని సుగర్ గ్రోవ్ దగ్గర ముగుస్తుందని తెలిపారు. హిందూ ధర్మంపై అవగాహన తీసుకురావడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని హిందూ మందిర్ ఎంపవర్మెంట్ కౌన్సిలుకు చెందిన తేజల్ షా అన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :