తెలంగాణలో భారీ పెట్టుబడి.. 300 కోట్లతో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
హైదరాబాద్లో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూప్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ప్రారంభించనుంది. దీనికోసం త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుంది. దీని ద్వారా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల మేరకు పెట్టుబడి రాష్ట్రానికి రానుందని, వెయ్యిమంది వరకు ఉద్యోగ అవకాశాలు పొందుతారని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ సంస్థలతో రూ.50 వేల కోట్ల మేరకు పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని, ఈ ఒప్పందాలతో రానున్న రెండేళ్లలో 20 నుంచి 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని వెల్లడించారు.
Tags :