మార్క్ జుకర్ బర్గ్ భారత్ పర్యటన
![మార్క్ జుకర్ బర్గ్ భారత్ పర్యటన](https://www.telugutimes.net/storage/news/news_new_69163.jpg)
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా అధిపతి మార్క్ జుకర్బర్గ్ ఆసియా పర్యటన చేపట్టారు. కుటుంబంతో కలిసి జపాన్ చేరుకున్న ఆయన అక్కడినుంచి దక్షిణకొరియా వెళ్లి ఆ తర్వాత భారత్కు రానున్నారు. ఈ పర్యటనలో పలు కీలక సమావేశాల్లో ఆయన పాల్గొనున్నారు. యాపిల్తో పోటీ పడేందుకు ఓ డీల్ కుదుర్చుకోనున్నారు. ఇక, ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ తనయుడి ప్రీ వెడ్డింగ్ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. ప్రస్తుతం జపాన్లో ఉన్న జుకర్ అక్కడ సంప్రదాయ కటానా ( కత్తులు) ఎలా తయారు చేస్తారో నేర్చుకున్నారు. స్వయంగా కొలిమిలోని ఇనుమును సుత్తితో కొట్టి కత్తిని తయారు చేశారు. ఈ పర్యటనలో భాగంగా టోక్యోలోని ఫేస్బుక్ డెవలపర్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :