రాజకీయాల నుంచి తప్పుకొంటే.. అక్కడికే వెళ్లి ఎంజాయ్ చేస్తా
![రాజకీయాల నుంచి తప్పుకొంటే.. అక్కడికే వెళ్లి ఎంజాయ్ చేస్తా](https://www.telugutimes.net/storage/news/news_new_68406.jpg)
కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్టు మా కుటుంబం నుంచి 3 పదవులు ఉండాలని అనుకున్నాం. పార్టీ అధినేత ఆదేశిస్తే రాబోయే లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు మా కుమారుడు భద్రారెడ్డి సిద్దంగా ఉన్నాడు అని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ టికెట్ కోసం రేవంత్రెడ్డిని జగ్గారెడ్డి పొగుడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఫోకస్ కావడం కోసం నా పేరు ప్రస్తావిస్తున్నారు. మల్లారెడ్డి పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరు. గతంలో రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన విమర్శలు అందరికీ గుర్తున్నాయి. గోవాలో నాకు హోటల్ ఉంది. రాజకీయాలు నుంచి తప్పుకొంటే అక్కడికే వెళ్లి ఎంజాయ్ చేస్తా. మనిషి జీవితం ఒకేసారి వస్తుంది. ఎంజాయ్ చేయాలి అని పేర్కొన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :