చంద్రబాబు దంపతులను కలిసిన ఎల్విఎస్ఆర్కె ప్రసాద్
ఎపి స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్, టిడిపి మీడియా కమిటీ మాజీ చైర్మన్ ఎల్విఎస్ఆర్కె ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, నారా భువనేశ్వరిని కలిసి అభినందనలు తెలియజేశారు. ఎపిలో టిడిపి ఘనవిజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ, ఎన్టీఆర్ కుమార్తెగా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ ఎన్నికల్లో విజయంకోసం శ్రమించారని ఆయన చెప్పారు. టీడీపీకి మద్దతుగా నిజం గెలవాలి పేరుతో రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన భువనేశ్వరి కృషి, వైఎస్సార్సీపీ దుష్పరిపాలన, ప్రతీకార రాజకీయాలు రాష్ట్రంలో తిరిగి తెలుగుదేశం పార్టీ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చాయని ప్రసాద్ పేర్కొన్నారు.
Tags :