ఈ విషయంలో లోకేష్ ను జగన్ తో పోలుస్తున్న నేతలు..
![ఈ విషయంలో లోకేష్ ను జగన్ తో పోలుస్తున్న నేతలు..](https://www.telugutimes.net/storage/news/news_new_71001.jpg)
కేంద్ర ప్రభుత్వం నారా లోకేష్ కు Z కేటగిరి సెక్యూరిటీని కల్పించడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఆయన గుమ్మం దాటి బయట రావాలన్న టైట్ సెక్యూరిటీ మధ్య జరుగుతుంది. ఇంత కట్టుదిట్టమైన భద్రత మధ్య లోకేష్ ఉండడం మంచిది కాదు అని కొందరు టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఒకప్పటి జగన్ సెక్యూరిటీతో కూడా పోలుస్తున్నారు. 2012 లో జగన్ ఓదార్పు యాత్రలు చేస్తున్న సమయంలో అతనికి భద్రత కల్పించాలి అని ఒక వైసీపీ నేత కేంద్రాన్ని కోరడంతో జగన్కు జడ్ కేటగిరీ భద్రత కల్పించారు. అయితే జగన్ మాత్రం తన భద్రత చూడడానికి ప్రజలు ఉన్నారు అన్న ధీమా వ్యక్తం చేసి సెక్యూరిటీని సున్నితంగా తిరస్కరించారు. దీంతో జగన్ ని కలిసే అవకాశం సామాన్య ప్రజలకు కూడా దక్కింది. ఒకరకంగా ప్రజల్లో జగన్ కి పాపిలారిటీ పెరగడానికి ఈ ఓదార్పు యాత్రలు ఎంతో పనికొచ్చాయి. ఇప్పుడు నారా లోకేష్ సెక్యూరిటీ చూసి అందరూ అతన్ని జగన్ తో పోలుస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నారా లోకేష్ కి ఉన్న ప్రాణభయం కూడా ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఇలాంటి సెక్యూరిటీ జనాల్ని భయపెట్టి అతన్నించి దూరం చేస్తుంది. అని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. బాహుబలి సినిమాలో చెప్పినట్లు మూలవిరాట్ అయినా ఉత్సవ విగ్రహం రూపంలో ప్రజల మధ్య తిరిగి సమస్యలు తెలుసుకోవాల్సిందే కదా.. అలా కాకుండా సెక్యూరిటీ మధ్య ఆలయంలో విగ్రహంలా మిగిలిపోతే ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి.. ఒకరకంగా ఈ సెక్యూరిటీ లోకేష్ కి మైనస్ అవుతుందేమో అని టీడీపీ నేతలు భయపడుతున్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)