తాను ఏదైనా మాటల్లో చెప్పను.. నిలబడి చూపిస్తా
![తాను ఏదైనా మాటల్లో చెప్పను.. నిలబడి చూపిస్తా](https://www.telugutimes.net/storage/news/news_new_65338.jpg)
తాను ఏదైనా మాటల్లో చెప్పనని నిలబడి చూపిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ సమక్షంలో పలు పార్టీలకు చెందిన నాయకులు జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన కార్యకర్తలుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, ఎన్ని కష్టాలు ఎదురైనా నిలబడ్డామన్నారు. పార్టీలో చేరేందుకు చాలా మంది వస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. నిర్ణయాత్మక శక్తి ఉంటేనే ఏదైనా సార్థకమవుతుంది. విధానాలు రూపొందించే అధికారం రావాలి. బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు వారికే ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీ నిధులు వారికే వెళ్లాలి. ఎవరికైతే కేటాయించారో వారికే ఆ నిధులు వెళ్లాలి. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టా. అణగారిన, అధికారం చూడని వర్గాలకు సాధికారత రావాలి అని అన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :