పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే ఆ పార్టీనే
పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, సురేశ్రెడ్డిలతో కలిసి ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ. ఆయారాం గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టింది ఆ పార్టీనే. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలుమార్లు ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు ప్రజలు 9 సార్లు అధికారం కట్టబెట్టారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆరుగురిని లాగేసుకుంది. ఆరుగురు ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడిని చేర్చుకుంది అని అన్నారు.
Tags :