ఖైదీ2పై కార్తీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్ హడావిడి నడుస్తుంది. కొందరు సౌత్ డైరెక్టర్లు బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ తీస్తూ బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే ఈ మధ్య తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఖైదీతో పాటూ విక్రమ్ తో కూడా లోకేష్ తనదైన సినిమాటిక్ యూనివర్స్ను సృష్టించాడు.
ఖైదీ రిలీజైన నుంచి ఆ సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆసక్తి పెరిగిపోయింది. అందరూ కోరుకున్నట్లు ఖైదీ2 ఉంటుందని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ప్రస్తుతం లోకేష్, సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు. కార్తీ తన హిట్ సినిమా సర్దార్ కు సీక్వెల్ గా సర్దార్2 చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా కార్తీ ఓ సందర్భంలో ఖైదీ2 గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఖైదీ2 సినిమాను 2025లో స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపాడు. మళ్లీ బిర్యానీ బకెట్ ను అందుకునే టైమ్ రాబోతుందని, కాకపోతే దాని కోసం కొన్నాళ్లు వెయిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. ఖైదీలో కార్తీ చేసిన ఢిల్లీ క్యారెక్టర్ కు మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఆడియన్స్ ఖైదీ2 కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.