కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిద్దరికీ పార్టీ రాష్ట్ర ఇంఛార్జి దీపా దాస్ మున్షీ కాంగ్రెస్ కండువాలు కప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయాలని వారికి రేవంత్ రెడ్డి సూచించారు. వరంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కావ్య పోటీ చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై నేతలు చర్చించారు.
Tags :