ASBL NSL Infratech

హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్‌రావు, జస్టిస్ రాజేశ్వర్‌రావు

హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్‌రావు, జస్టిస్ రాజేశ్వర్‌రావు

తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించడానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిద్దరినీ శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ తెలంగాణ హైకోర్టు కొలీజియం ఫిబ్రవరి 13న సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ ఆమోదం తెలపగా, వారి పనితీరుపై సంతృప్తి చెందిన సుప్రీంకోర్టు కొలీజియం శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :