దేవరకు మైథలాజికల్ టచ్
![దేవరకు మైథలాజికల్ టచ్](https://www.telugutimes.net/storage/news/news_new_65259.jpg)
ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ ని కొరటాల తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న దేవరలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఫిక్షనల్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్ కు గూస్బంప్స్ తెప్పిస్తాయని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే దేవర గురించి నెట్టింట మరో ఆసక్తికర వార్త వినిపిస్తుంది. ఈ సినిమాలో మైథాలాజికల్ పాయింట్ ను కూడా టచ్ చేయబోతున్నాడట కొరటాల. ఒకవేళ అదే జరిగితే దేవర వెయ్యి కోట్ల మార్క్ ను అందుకోవడం ఖాయమంటున్నారు ట్రేడ్ పండితులు.
ఇప్పటికే మైథలాజికల్ పాయింట్ తో వచ్చిన కార్తికేయ2, కాంతారా సినిమాలు బ్లాక్ బస్టర్లు కాగా, దేవర కూడా అదే నేపథ్యంలో వస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)