అమెరికాలో భారత విద్యార్థుల మరణాలపై విచారణ : రణ్దీప్ జైశ్వాల్
![అమెరికాలో భారత విద్యార్థుల మరణాలపై విచారణ : రణ్దీప్ జైశ్వాల్](https://www.telugutimes.net/storage/news/news_new_71627.jpg)
అమెరికాలో ఇద్దరు భారత విద్యార్థుల మృతిపై విచారణ జరుగుతున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. సంబంధిత అధికారుల దృష్టికి భారత విద్యార్థుల మృతి విషయం తీసుకువెళుతున్నట్లు తెలిపింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్దీప్ జైశ్వాల్ మాట్లాడుతూ అమెరికాలో దురదృష్టకర పరిస్థితుల్లో జనవరి నుంచి 10 మంది భారత విద్యార్థులు మృతి చెందారని తెలిపారు. వారి మరణాల వెనుక అనేక కారణాలు ఉన్నాయని తెలిపారు. అమెరికాలో వివేక్ సైని అనే విద్యార్థి ఒక సంచార వ్యక్తి చేతిలో హత్యకు గురయ్యాడని, మరో విద్యార్థి కాల్పుల్లో మృతి చెందాడని తెలిపారు. ఈ రెండు ఘటనలపై విచారణ జరుగుతోందన్నారు. క్లీవ్లాండ్ నగరంలో గత నెల నుంచి కనిపించకుండపోయిన మహమ్మద్ అబ్దుల్ ఆరాఫత్ (25) మృతదేహం ఏప్రిల్ 9న లభించింది. హైదరాబాద్లోని నాచారానికి చెందిన ఇతడు గత ఏడాది క్లీవ్ లాండ్ వర్సిటీలో మాస్టర్స్ చేసేందుకు వెల్లాడు. అలాగే గద్దె ఉమా సత్యసాయి అనే తెలుగు విద్యార్థి క్లీవ్లాండ్ లోని ఓ కాలేజీలో ఉన్నత విద్య కోసం వెళ్లి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)