ASBL NSL Infratech

అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని క్షేమం

అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని క్షేమం

అమెరికాలో గత నెల 28న కనిపించకుండా పోయిన హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని నితీషా కందుల (23) సురక్షితంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మే 28న లాస్‌ఏంజెల్స్‌లో నితీషా తప్పిపోయారు. ఎప్పుడూ, ఎక్కడ, ఎలా గుర్తించారనే వివరాలను మాత్రం పోలీసులు వెల్లడిరచలేదు. మే 28న కనిపించకుండా పోయిన నితీషా కోసం బంధువులు, స్నేహితుల ఇండ్లలోనూ వాకబుచేసినా ఆచూకీ లభించలేదు. దాంతో స్నేహితులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మే 30న ఫిర్యాదు చేశారు. అమెరికాలో ఇటీవల భారత విద్యార్థులు అదృశ్యమవుతున్న కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నితీషా క్షేమంగా ఉన్నట్టు గుర్తించినట్లు వెల్లడిరచారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :