భారత సంతతి గణితవేత్త సుబ్రమణ్యం ఇక లేరు
భారత సంతతికి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త, అమెరికా వాహన దిగ్గజం జనరల్ మోటార్స్ (జీఎం) వ్యవస్థాపక డైరెక్టర్ అయిన డాక్టర్ టి.ఎన్. సుబ్రమణ్యం(76) కన్నుమూశారు. అమెరికాకు 1979లో వలస వెళ్లిన సుబ్రమణ్యం మనదేశంతో పాటు అమెరికాలోని విద్యాధికులకు బాగా తెలిసిన వ్యక్తి. పలు గణిత నమూనాలు, సిద్దాంతాలను ఆయన కనిపెట్టారు. జీఎమ్ కార్లకు గణిత నమూనాలను తీసుకురావడం కోసం జనరల్ మోటార్స్ ఈయన్ని నియమించుకుంది. ఆ తర్వాత రూట్ వన్ కంపెనీనీ ఆయన ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ జీఎమ్ కార్లకు, జీపీఎస్ సిస్టమ్స్కు ఆటో ఫైనాన్సింగ్ చేస్తోంది. అమెరికా పర్యటనలో భాగంగా అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ సుబ్రమణ్యంను వ్యక్తిగతంగా కలిసి, దేశం గర్వించదగ్గ పనులు చేయాలని ప్రోత్సహించారు కూడా. సుబ్రమణ్యంకు భార్య, కుమార్తె, అల్లుడు ఉన్నారు.
Tags :