పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం
![పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం](https://www.telugutimes.net/storage/news/news_new_74343.jpg)
న్యూయార్క్ లోని నసావు స్టేడియం వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో అత్యద్భుత విజయం అందుకుంది. పాక్ చతుర్ద్యయం నసీమ్ షా (3-21), హరీష్ రవూఫ్ (3-12), మహ్మద్ అమిర్ (2/23), షహీన్ అఫ్రిది (1/29) నిప్పులు చెరగడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. రిషభ్ పంత్ (31 బంతుల్లో 42,6 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా అక్షర్ పటేల్ (20) గుడ్డిలో మెల్లలా ఫర్యాలేదనిపించాడు. భారత్ బ్యాటర్లలో కోహ్లీత్ సహా ఏకంగా ఎనిమిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. బ్యాటర్లు విఫలమైనా బౌలర్లు సమిష్టిగా రాణించడంతో పాకిస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 113/7కే పరిమితమైంది. రిజ్వాన్ (44 బంతుల్లో 31, 1 ఫోర్, 1 సిక్సర్) రాణించినా మిగిలిన బ్యాటర్లు ఒత్తిడికి చిత్తయ్యారు. భారత్ విజయం కీలక పాత్ర పోషించిన బుమ్రా ( 3/14) కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)