అమెరికా వేదికగా భారత్ బోణీ అదిరింది
![అమెరికా వేదికగా భారత్ బోణీ అదిరింది](https://www.telugutimes.net/storage/news/news_new_74206.jpg)
టీ20 వరల్డ్కప్లో టీమిండియా బోణీ అదిరింది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత్ జట్టు తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. గ్రూప్-ఏలో భాగంగా జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో పసికూన ఐర్లాండ్ను చిత్తుగా ఓడిరచి టోర్నీలో శుభారంభం చేసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ భారత పేసర్లు నిప్పులు చెరగడంతో 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. హార్దిక్ పాండ్య (4-1-27-3), బుమ్రా (3-1-6-2), అర్ష్దీప్ (4-0-53-2) విజృంభించింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 12.2 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (52:37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా, రిషభ్ పంత్ (36:26 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్లు దూకుడుగా ఆడాడు. బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)