ఏపీ ప్రొటెం స్పీకర్ గా బుచ్చయ్య చౌదరి.. ప్రమాణస్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రొటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్భవన్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, ఎస్.సవిత, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవి, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబబివరావు, ఎం.ఎస్.రాజు, సుంకర విజయ్ కుమార్, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి బుచ్చయ్య చౌదరి ఎన్నికైన విషయం తెలిసిందే. సీనియర్ ఎమ్మెల్యే కావడంతో ఆయనే ప్రొటెం స్పీకర్గా ఎంపికయ్యారు.
Tags :