ASBL NSL Infratech

ఇటలీ పీఎం మెలానీతో మోదీ సెల్ఫీ వైరల్.. ప్రధాని రియాక్షన్ ఇదీ!

ఇటలీ పీఎం మెలానీతో మోదీ సెల్ఫీ వైరల్.. ప్రధాని రియాక్షన్ ఇదీ!

కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (సీఓపీ28) కోసం దుబాయ్ వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. తాజాగా ఇటలీ పీఎం మెలనీ జార్జియాను కలిశారు. మోదీతో సెల్ఫీ దిగిన ఆమె.. దాన్ని తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ‘సీఓపీ28లో గుడ్ ఫ్రెండ్స్’ అని ఈ ఫొటోకు క్యాప్షన్ కూడా జతచేసింది. దీనిపై స్పందించిన ప్రధాని.. ఇలా స్నేహితులను కలవడం ఎప్పుడూ సంతోషమేనని చెప్పారు. అలాగే, ‘సీఓపీ28 సమావేశంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలనీని కలవడం జరిగింది. నిలకడైన, మంచి భవిష్యత్తు కోసం భారత్, ఇటలీ కలిసి చేసే కృషి కోసం ఎదురు చూస్తున్నా’ అని తెలిపారు. ఇటలీ ప్రధానితోపాటు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, స్వీడన్ పీఎం ఉల్ఫ్ క్రిస్టర్‌సన్, టర్కీ ప్రెసిడెంట్ రీసెప్ టాయిప్ ఎర్డోగన్, బార్బడోస్ పీఎం మియా ఆమర్ మోట్లీ, ఫ్రెంచ్ ప్రధాని ఇమాన్యుయేల్ మాక్రాన్, యూకే ప్రధాని రిషి సునక్, యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ను కూడా ప్రధాని మోదీ కలిశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :