ASBL Koncept Ambience
facebook whatsapp X

ఐరాస సదస్సుకు తెలంగాణ విద్యార్థులు!

ఐరాస సదస్సుకు తెలంగాణ విద్యార్థులు!

న్యూయార్క్‌లోని ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో చేపట్టనున్న యాక్టివేట్‌ ఇంపాక్ట్‌ సదస్సుకు తెలంగాణ విద్యార్థులు ఎంపికయ్యారు. ఐక్య రాజ్యసమితి గుర్తింపు పొందిన 1ఎం1బీ (వన్‌ మిలియన్‌ వన్‌ బిలియన్‌) గ్రీన్‌ స్కిల్స్‌ అకాడమీ ద్వారా ఈ ఐదుగురు యువ ఆవిష్కర్తలు ఎంపికయ్యారు. వీరు డిసెంబరులో జరిగే ప్రపంచస్థాయి ప్రతిష్ఠాత్మక, 8వ వార్షిక, యాక్టివేట్‌ ఇంపాక్ట్‌ సదస్సుకు హాజరవుతారు. తెలంగాణ వ్యాప్తంగా 200 మంది పోటీలో ఉండగా, ఎంపికైన ఐదుగురిలో అప్నా ఇంటర్వ్యూ క్రాకర్‌ ప్రాజెక్ట్‌ను ఆవిష్కరించిన మీత్‌కుమార్‌షా ( విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ), మనల్‌ నుంచి మ్యానిఫెస్టింగ్‌ మ్యాన్‌హోల్స్‌ ప్రాజెక్ట్‌ సిద్ధం చేసిన నారాయణం భవ్య ( మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఫర్‌ ఉమెన్‌), ఇంటెల్‌నెక్సా పేర ప్రాజెక్టును ఆవిషరించిన మునీర్‌ ( దీక్షా డిగ్రీ కళాశాల, నిర్మల్‌) ఉన్నారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన మహిళా ఇంజినీరింగ్‌  కళాశాలల విద్యార్థినులు పెమ్మసాని లిఖిత చౌదరి, సత్యవతి కోలపల్లి మొక్కల పెంపకంపై రూపొందించిన ప్రాజెక్టు ద్వారా ఈ సదస్సుకు ఎంపికైనట్లు సంబంధిత విభాగాలు తెలిపాయి.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :