ఐరాస సదస్సుకు తెలంగాణ విద్యార్థులు!
న్యూయార్క్లోని ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో చేపట్టనున్న యాక్టివేట్ ఇంపాక్ట్ సదస్సుకు తెలంగాణ విద్యార్థులు ఎంపికయ్యారు. ఐక్య రాజ్యసమితి గుర్తింపు పొందిన 1ఎం1బీ (వన్ మిలియన్ వన్ బిలియన్) గ్రీన్ స్కిల్స్ అకాడమీ ద్వారా ఈ ఐదుగురు యువ ఆవిష్కర్తలు ఎంపికయ్యారు. వీరు డిసెంబరులో జరిగే ప్రపంచస్థాయి ప్రతిష్ఠాత్మక, 8వ వార్షిక, యాక్టివేట్ ఇంపాక్ట్ సదస్సుకు హాజరవుతారు. తెలంగాణ వ్యాప్తంగా 200 మంది పోటీలో ఉండగా, ఎంపికైన ఐదుగురిలో అప్నా ఇంటర్వ్యూ క్రాకర్ ప్రాజెక్ట్ను ఆవిష్కరించిన మీత్కుమార్షా ( విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), మనల్ నుంచి మ్యానిఫెస్టింగ్ మ్యాన్హోల్స్ ప్రాజెక్ట్ సిద్ధం చేసిన నారాయణం భవ్య ( మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్), ఇంటెల్నెక్సా పేర ప్రాజెక్టును ఆవిషరించిన మునీర్ ( దీక్షా డిగ్రీ కళాశాల, నిర్మల్) ఉన్నారు. అలాగే హైదరాబాద్కు చెందిన మహిళా ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థినులు పెమ్మసాని లిఖిత చౌదరి, సత్యవతి కోలపల్లి మొక్కల పెంపకంపై రూపొందించిన ప్రాజెక్టు ద్వారా ఈ సదస్సుకు ఎంపికైనట్లు సంబంధిత విభాగాలు తెలిపాయి.