కాంగ్రెస్ లోకి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్?
![కాంగ్రెస్ లోకి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్?](https://www.telugutimes.net/storage/news/news_new_68501.jpg)
బీఆర్ఎస్ నేత, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో బొంతు రామ్మోహన్ మర్యాద పూర్వకంగా కలిశారు. కాంగ్రెస్లో చేరికపై ఈ సందర్భంగా చర్చించారు. సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి లోక్సభ స్థానాల్లో ఏదో ఒకచోట కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశమివాల్వని కోరారు. ముందు చేరండి, పార్టీ పరిశీలిస్తుందని సీఎం చెప్పారని రామ్మోహన్ తెలిపారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్, కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :