కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు
![కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు](https://www.telugutimes.net/storage/news/news_new_69212.jpg)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్కు సంబంధించి విచారణకు మార్చి 4న రావాలని పేర్కొంది. ఇలా కేజ్రీవాల్కు ఈడీ సమన్లు ఇవ్వడం ఇది ఎనిమిదోసారి. ఏడోసారి ఇచ్చిన నోటీసుల గడువు (సోమవారం) ముగిసిన మరుసటి రోజే మరోసారి సమన్లు జారీ కావడం గమనార్హం. ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్కు నవంబర్ 2న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తొలిసారి సమన్లు జారీ చేసింది. అనంతరం వరుసగా నోటీసులు పంపిస్తుస్నప్పటికీ ఆయన హాజరు కావడం లేదు. ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉన్న తరుణంలో ఈడీ నోటీసులు పంపించడం చట్టవిరుద్ధమని వాదిస్తున్నారు. ఇలా పదేపదే సమన్లు జారీ చేయడం సరికాదని, కోర్టు ఆదేశాలు వెలువడే వరకు ఓపికతో వేచి ఉండాలని ఈడీనీ ఆప్ కోరింది. కానీ తాజాగా మరోసారి సమన్లు జారీ అయ్యాయి.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)