ఇదంతా కలి ప్రభావం… భార్య తిరుగుబాటు పై స్పందించిన దువ్వాడ..
శ్రీకాకుళం జిల్లా లోని టెక్కలి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన భర్త పై ఇండిపెండెంట్గా పోటీకి దిగుతున్నానని దువ్వాడ వాణి ప్రకటించిన నేపథ్యంలో అక్కడ ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ దువ్వాడ శ్రీనివాస్ ఈ విషయంపై తాజాగా స్పందించారు.టెక్కలి నుంచి తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు జడ్పీటీసీ సభ్యురాలు, దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ప్రకటించిన విషయం తెలిసిందే. దీని పై స్పందించిన శ్రీనివాస్.. ప్రజాస్వామ్యంలో నామినేషన్ వేసే హక్కు ఎవరికైనా ఉంటుందని అన్నారు. కొన్నిసార్లు సొంత అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు కూడా తమపై తిరగబడతారని.. ఇది అంతా కలియుగ ప్రభావం అని అన్నారు. అయితే మరో పక్క తన భార్య నామినేషన్ వేయదని అనుకుంటున్నానని చెప్పారు. అంతేకాదు టెక్కలిలో తాను 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.