ASBL NSL Infratech

కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ

కడప నుంచి వైఎస్ షర్మిల పోటీ

ఆంధ్రప్రదేశ్‌లో 5 లోక్‌సభ, 114 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ ఖరారు చేసింది. కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పోటీ చేయనున్నారు. కాకినాడ, బాపట్ల నుంచి కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, రాజమహేంద్రవరం నుంచి పీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు రుద్రరాజు బరిలో దిగనున్నారు. అభ్యర్థుల జాబితాను షర్మిల ఇడుపులపాయలోని తన తండ్రి రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద విడుదల చేయనున్నారు.  కడప, కాకినాడ, బాపట్ల, రాజమహేంద్రవరం, కర్నూలు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నారు. గత రెండు రోజులుగా షర్మిలతోపాటు సీనియర్‌ నేతలు ఢల్లీిలోనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని మాజీ మంత్రి రఘువీరారెడ్డి నిర్ణయించారు. పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేయనున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :