సోనియా గాంధీని ఆహ్వానించిన సీఎం రేవంత్
![సోనియా గాంధీని ఆహ్వానించిన సీఎం రేవంత్](https://www.telugutimes.net/storage/news/news_new_73901.jpg)
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. జూన్ 2న తెలంగాణలో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. సోనియా గాంధీతో భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్సలో వచ్చే నెల 2న నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలన్న తమ ఆహ్వానంపై సోనియా సానుకూలంగా స్పందించారని తెలిపారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజానీకానికి ఇది చాలా సంతోషకరమైన వార్త అన్నారు. కాంగ్రెస్ శ్రేణులంతా కూడా సోనియా గాంధీ పర్యటన కోసం, రాష్ట్ర అవతరణ ఉత్సవాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ప్రజా తెలంగాణలో తొలిసారిగా జరుగుతున్న ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని తెలిపారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)