ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెండిరగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి, రివర్ బేసిన్ ప్రణాళికల అమలు, వరద నిర్వహణ, డ్యాంల భద్రత వంటి పనులకు సహకారం అందించాలని ప్రపంచబ్యాంకు ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీర్ఘకాలిక నీటి అవసరాలు, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో ప్రపంచ బ్యాంకు తోడ్పాటు అవసరమన్నారు. సచివాలయంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులు సుమీలా గుల్యానీ, జూప్ స్టీట్జెస్డిజ్కీ, రాజగోపాల్ సింగ్తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ప్రపంచబ్యాంకు బృందం రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించినట్లు సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో నీటి నిర్వహణ, సామర్థ్యం ప్రపంచబ్యాంకు సహకారంతో మరింత బలోపేతమవుతుందని ఆయన వెల్లడించారు.
Tags :