ASBL Koncept Ambience
facebook whatsapp X

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు 

ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు 


భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారిని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వారిద్దరూ చర్చించారు. ఈనెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా, రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. గత ప్రభుత్వం విధ్వంసంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రధాన మంత్రికి నివేదించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరడంతో పాటు మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలని కోరారు.  

ప్రధానితో సమావేశానికి ముందు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన సీఎం.. ఆ తర్వాత మరికొందరు మంత్రులను కలిసి వినతులు సమర్పించారు. కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్రెడ్డితో పాటు పలువురు  ఎంపీలు చంద్రబాబు వెంట ఉన్నారు. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబును టీడీపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును చంద్రబాబు అభినందించారు. ఇటీవల పార్లమెంటులో ప్రమాణస్వీకారానికి అప్పలనాయుడు సైకిల్ పై వెళ్లడం తెలిసిందే. అప్పలనాయుడు పార్లమెంటుకు సైకిల్ పై వచ్చిన విషయాన్ని చంద్రబాబుకు  ఇతర ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. .

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :