యెడియూరప్ప కు సీఐడీ నోటీసులు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు యెడియూరప్పకు పోక్సో కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది. యెడియూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, బెంగళూరు రాగానే సీఐడీ ముందు విచారణకు హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ 17 ఏండ్ల బాలిక పట్ల యెడియూరప్ప అసభ్యంగా ప్రవర్తించి, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత బాలిక తల్లి మార్చి 14వ తేదీన సదాశివనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ కర్ణాటక డీజీపీ అలోక్ మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో యెడియూరప్పకు నోటీసులు జారీ అయ్యాయి. తాను ఎవర్నీ కూడా లైంగికంగా వేధించలేదని, ఈ కేసు విషయంలో న్యాయ పోరాటం చేస్తామని యెడియూరప్ప గతంలో ప్రకటించారు.
Tags :