ASBL NSL Infratech

బాబు కొల్హాపూర్ ఆలయ సందర్శన.. మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు..

బాబు కొల్హాపూర్ ఆలయ సందర్శన.. మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు..

2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఊహించని ఓటమిని ఎదుర్కొన్నారు. అందుకే ఈసారి 2024 ఎన్నికల్లో ఎంతో తెలివిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలను ఎమోషనల్ గా టచ్ చేస్తూ.. వారికి బాగా కనెక్ట్ అయ్యారు. సోమవారం నాడు జరిగిన పోలింగ్లో కూడా టీడీపీ హవా ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ఇటు జగన్ కూడా తమ విజయంపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పథకాల ద్వారా మరే ముఖ్యమంత్రి చేయనంత ప్రజలకు లబ్ధి చేశాను.. అందుకే వారి ఆశీర్వాదం ఎప్పుడూ నా వెంట ఉంటుంది అని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరిలో ఎవరి అంచనాలు నెగ్గుతాయో జూన్ 4 కి తెలిసిపోతుంది. ఇక ఈలోపు జగన్ కుటుంబంతో గడపడానికి ఫారిన్ ట్రిప్ కి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రేపు మహారాష్ట్రలోని కొల్హాపూర్ దేవాలయానికి వెళ్ళనున్నారు. కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయం లో చంద్రబాబు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట. అనంతరం మధ్యాహ్నం షిరిడి చేరుకొని సాయిబాబా ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. ప్రచారం ముగిసిన వెంటనే తిరుమల చేరుకున్న చంద్రబాబు శ్రీవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి వారణాసికి కూడా వెళ్లారు. రిజల్ట్స్ తమకు అనుకూలంగా రావడం కోసం చంద్రబాబు వరుస ఆలయాల సందర్శనతో చాలా బిజీగా ఉన్నారు.



praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :