ASBL NSL Infratech

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సతీమణి భువనేశ్వరితో కలిసి దర్శనం చేసుకున్నారు. అంతకుముందు వైకుంఠం కాంప్లెక్స్‌ వద్ద వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. శ్రీవారి దర్శనం అనతరం రంగనాయకుల మండపంలో చంద్రబాబు దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. అలిపిరి వద్ద దాడి జరిగినప్పుడు శ్రీవారే కాపాడారని చంద్రబాబు అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  త్వరలోనే  నా కార్యాచరణ ప్రకటిస్తాను. ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని శ్రీవారిని వేడుకున్నాను. కష్టం వచ్చినప్పుడు స్వామివారిని మొక్కుకున్నారు. ధర్మాన్ని కాపాడాలని ప్రార్థించాను. ప్రపంచంలోనే భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి. తెలుగుజాతి ప్రపంచంలోనే నవంబర్‌ వన్‌గా ఉండాలి అని కోరుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి అమర్నాథరెడ్డితో పాటు పలువురు నేతలు ఉన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :