ఆ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై... చర్యలు
![ఆ రోజు సెలవు ఇవ్వని సంస్థలపై... చర్యలు](https://www.telugutimes.net/storage/news/news_new_73091.jpg)
మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు ఉంటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ సమయం దగ్గర పడినందున నిఘా మరింత పెరుగుతుందన్నారు. జూన్ 1న సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేదం ఉందన్నారు. బందోబస్తు కోసం రాష్ట్రానికి, కేంద్ర బలగాలు వచ్చాయని, 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారని తెలిపారు. తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.320 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తనిఖీలకు సంబంధించి 8వేలకు పైగా కేసులు నమోదు చేశామన్నారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారని తెలిపారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :