ASBL NSL Infratech

లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు..

లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు..

ఎన్నికల వేడి మన రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కూడా బాగా కనిపిస్తోంది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు పై కేసు నమోదు చేశారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయగా ఆయనపై కేసు నమోదు అయింది. మాజీ మంత్రి హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తమపై రఘునందన్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ హైదరాబాద్‌లోని ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కలిసి తమ ఫిర్యాదు అందించారు. ఈ మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :