కాలిఫోర్నియాలో సగం అంకురాలు ప్రవాసులవే
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పాటైన అంకుర సంస్థల్లో 42 శాతం ప్రవాసుల/ వలసదార్లవేనని గవర్నర్ గవిన్ న్యూసమ్ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక నిధుల సమీకరణ కార్యక్రమంలో దిగ్గజ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్తలనుద్దేశించి ప్రసంగించారు. యూఎస్ ఇండియా సెక్యూరిటీ కౌన్సిల్ ప్రెసిడెంట్ రమేశ్ విశ్వనాథ్ కపుర్, ఆయన భార్య సుసాన్ ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం అంకురాల్లో 42 శాతం వలసదార్లు స్థాపించినవే. మా రాష్ట్రానికి వాళ్లు జీవనాడి లాంటి వారు. స్థానికత, విద్వేషం వంటివి మా రాజకీయాల్లో కలిసిపోయాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తులు ఈ విషయంలో ముందుంటారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ కాలిఫోర్నియాలో అంకుర వ్యవస్థ బలంగా నిలబడగలిగింది. భిన్నత్వాన్ని ఆహ్వానించినందు వల్లే తయారీలో ముందున్నాం. అత్యధిక సంఖ్యలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నోబెల్ గ్రహీతలు మా దగ్గర ఉన్నారని తెలిపారు.