వారిని బీజేపీలో చేర్చుకోం : ఆదినారాయణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాజధాని శిబిరాల వద్దకు బీజేపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విచ్చేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా కొనసాగుతున్న వేళ ఆయన అక్కడికి చేరకొని పరిశీలించారు. జగన్ ఓటమి అమరావతి ఉద్యమం కూడా ఒక ముఖ్య కారణమని తెలిపారు. రాజధానిని తరలించాలని చూసిన జగన్కు జనం బుద్ధి చెప్పారన్నారు. వైసీపీ త్వరలోనే భూస్థాపితం అవుతుందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరాలని చూస్తున్నారని వెలడించారు. అయితే వారిని బీజేపీలో చేర్చుకోబోమని స్పష్టం చేశారు.
Tags :