ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో బిల్ గేట్స్ భేటీ
![ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో బిల్ గేట్స్ భేటీ](https://www.telugutimes.net/storage/news/news_new_69281.jpg)
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ఒడిశా రాజధాని భువనేశ్వర్లో పర్యటించారు. విమానాశ్రయం నుంచి నేరుగా మంగళా అనే మురికివాడకు చేరుకుని అక్కడున్న కుటుంబాలతో ముచ్చటించారు. వారి జీవన ప్రమాణాలు, పిల్లల చదువుల గురించి తెలుసుకున్నారు. ఇళ్లలోకి వెళ్లి మంచినీరు, విద్యుత్తు సరఫరా, మురుగుదొడ్లను పరిశీలించారు. అక్కడి నుంచి స్వయం సహాయక సంఘాల ప్రధాన కార్యాలయం మిషన్ శక్తి భవన్ను సందర్శించి ఉత్పత్తులు, విక్రయాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై ఆరా తీశారు. ఆ తరువతా బిల్గేట్స్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన కృషిభవన్ను సందర్శించారు. అనంతరం సీఎం నవీన్ పట్నాయక్ను కలిసి అరగంటపాటు మాట్లాడారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :