లోక్ సభ ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మహతాబ్
లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ వ్యవహరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన్ని నియమించినట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. సీనియర్ ఎంపీ మహతాబ్ స్పీకర్ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్సభ ప్రిసైడింగ్ అధికారిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని రిజిజు తెలిపారు. 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారని, ఆయనకు కె. సురేష్ (కాంగ్రెస్), టీఆర్ బాలు ( డీఎంకే), సుదీప్ బంధోపాధ్యాయ (టీఎంసీ)లతో పాటు బీజేపీకి చెందిన రాధామోహన్ సింగ్, ఫగన్ సింగ్ కులస్తేలతో కూడిన చైర్పర్సన్ల ప్యానెల్ సహాయంగా ఉంటుందని మంత్రి తెలిపారు.
Tags :