జనసేన ను వీడిన కీలక నేత.. షాక్ లో పవన్..
ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణం సెగలు పుట్టిస్తుంది. ప్రత్యర్థిల పై మాటల యుద్ధాలు చేస్తున్నారు నేతలు. టికెట్టు రానివారు, పార్టీ వైఖరితో విసుగు చెందినవారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నుంచి ఓ ముఖ్య నేత బయటకు వెళ్తున్నారు . టీడీపీ, బీజేపీ తో పోత్తు కారణంగా జనసేన కేవలం 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు పరిమితమైంది. మొదటినుంచి జనసేనకు కనీసం 50 టికెట్లు అయినా వస్తాయి అని ఆశించిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు తీవ్ర నిరాశ చెందుతున్నారు. సీట్ల కేటాయింపు విషయంలో జనసేనకు అన్యాయం జరిగింది అని ఆ పార్టీ నేతలలో బలమైన అభిప్రాయం నాటుకు పోయింది. ఉన్నవారికి టికెట్ దక్కలేదు సరి కదా.. కొత్తగా చేరిన వారికి ఎక్కువ సీట్లు కేటాయించారు.. ఇలా ఎన్నో విషయాలపై మనస్థాపన చెందిన కొందరు పార్టీ నాయకులు అసంతృప్తి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడమే కాకుండా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించిన అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ పరుచూరి భాస్కరరావు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో జనసేన శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి.