అమరావతిలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు
![అమరావతిలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు](https://www.telugutimes.net/storage/news/news_new_74393.jpg)
తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో 2026 జనవరి 4, 5, 6 తేదీల్లో అమరావతిలో 3వ తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సభలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ సభల్లో ప్రవాస తెలుగు సంఘాలతో సాంస్కృతిక ప్రదర్శనలు, మన తెలుగు సంస్కృతి, సంచార జాతుల కళారూపాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులతో కాకుండా భాషాభిమానుల సహకారంతో తెలుగు మహాసభలను నిర్వహిస్తుందన్నారు.
![praneet](/storage/article-ads/radha-county.jpg)
![praneet](/storage/article-ads/loft.jpeg)
![praneet](/storage/article-ads/praneet-ads.jpg)
![obili-garuda](/storage/article-ads/obili-garuda-ads.jpg)
![Vertex](/storage/article-ads/vertex.jpeg)
![poulomi](/storage/article-ads/poulomi-ads.jpg)
![Png-jewelry](/storage/article-ads/png-jewelry-ads.jpg)
Tags :