ASBL NSL Infratech

అమరావతిలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు

అమరావతిలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు

తెలుగు భాష ఔన్నత్యాన్ని  ప్రపంచానికి తెలియజేసేందుకు ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో 2026 జనవరి 4, 5, 6 తేదీల్లో అమరావతిలో 3వ తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్‌ అధ్యక్షుడు డాక్టర్‌ గజల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సభలకు రాష్ట్రపతి ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ సభల్లో ప్రవాస తెలుగు సంఘాలతో  సాంస్కృతిక ప్రదర్శనలు, మన తెలుగు సంస్కృతి, సంచార జాతుల కళారూపాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిధులతో కాకుండా భాషాభిమానుల సహకారంతో తెలుగు మహాసభలను నిర్వహిస్తుందన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :