రష్మిక, విజయ్ దేవరకొండల పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.
వీరి పెళ్లి వేడుకలు మూడు రోజులుగా రాజస్థాన్ లోని ఉదయపూర్ లో జరుగుతున్నాయి.
హల్దీ వేడుక తర్వాత వేద పండితులు వధూవరులతో పూజలు చేయించి, ఆశీర్వచనాలు అందించారు.
దేవరకొండ కుటుంబానికి కోడలిగా వస్తున్న రష్మికకు విజయ్ తల్లి మాధవి అదిరిపోయే బహుమతిని ఇచ్చినట్టు తెలుస్తోంది.
వారసత్వంగా వస్తున్న బంగారు గాజులను విజయ్ తల్లి తన కోడలు రష్మికకు ఇచ్చిందని, ఆ బహుమతికి రష్మిక చాలా ఎమోషనల్ అయిందని సమాచారం.
పెళ్లి వేడుకలకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. వేడుకలు చాలా ప్రైవేట్గా నిర్వహించారు.
సాంప్రదాయ దుస్తుల్లో వధూవరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుక తర్వాత హైదరాబాద్లో సినీ ప్రముఖుల కోసం ప్రత్యేక రిసెప్షన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఎండాకాలంలో చర్మ సంరక్షణకు సులభమైన చిట్కాలు