వేసవి కాలంలో ఇడ్లీ పిండి త్వరగా పులిసి రుచిని కోల్పోవడం చాలా మందికి ఎదురయ్యే సమస్య.
ఇడ్లీ పిండి సాధారణంగా సమ్మర్లో త్వరగా ఫర్మెంట్ అవుతుంది. దీంతో పిండి ఎక్కువ పులుపుగా మారి ఇడ్లీ రుచి తగ్గుతుంది.
ఈ సమస్యకు సులభమైన పరిష్కారంగా తమలపాకు ఉపయోగించబడుతోంది. పిండిపై ఒక తమలపాకు ఉంచడం ద్వారా ఫర్మెంటేషన్ వేగం కొంత నియంత్రణలో ఉంటుంది.
ఇలా చేయడం వల్ల వేసవిలో కూడా ఇడ్లీలు మృదువుగా వస్తాయి. రుచిలో అధిక పులుపు తగ్గి సహజమైన సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది.
తేలికపాటి సువాసన పిండికి తాజాదనాన్ని ఇస్తుంది. ఇది ఇడ్లీ రుచిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది.
ఫ్రిజ్లో పెట్టే సమయంలో కూడా ఇడ్లీ పిండి డబ్బాలో ఒక రెండు తమలపాకులు వేసి పెడితే నాలుగైదు రోజులు వరకు పిండి పులవకుండా ఉంటుంది.