పలుచబడుతున్న షర్మిల సభలు..కారణం అదేనా?
కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల సభలు రాను రాను పల్చబడి పోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆమెకు విపరీతమైన కవరేజ్ ఇచ్చిన మీడియా సంస్థలు కూడా ఇప్పుడు ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదు. దీనికి కారణం.. ప్రతి ప్రసంగంలో ఆమె అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లాగా ఒకటే పదాన్ని తెప్పించి మళ్ళి మాట్లాడడం. వైయస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డని.. న్యాయం కోసం పోరాడుతున్నా.. మా బాబాయిని హత్య చేసింది అవినాష్.. హంతకుడికి పదవి ఇస్తారా.. షర్మిల మాటల్లో ఎటు చూసి కనిపించే విషయాలు ఇవే. కొత్తగా మాట్లాడడానికి ఏమీ లేకపోవడం చేతనో లేక ఆమె చెప్పాలి అనుకున్న విషయాన్ని ప్రజలకు గట్టిగా గుర్తుంది పోయేలా చెప్పాలి అన్న అభిప్రాయమో తెలియదు కానీ గత కొద్ది కాలంగా షర్మిల ఈ నాలుగు మాటలు తప్ప ఇంకేమీ మాట్లాడటం లేదు. ఈ విషయంలో ఆమెను విభేదిస్తున్న వారి సంఖ్య ఒక్క వివేకానంద హత్య కేసును టార్గెట్ చేసి ఆమె పదే పదే మాట్లాడడంతో ప్రజలకు ఆమె సభలు అంటే విసుగు వస్తున్నాయి. గత రెండు మాసాలుగా షర్మిల ఎక్కడ మాట్లాడినా జగన్ ని తిట్టడం.. చంద్రబాబును విమర్శించడం.. ఇంతకుమించి ఆమె చేస్తున్నది ఏమీ లేదు. మొదట్లో ఒక్క జగనే టార్గెట్ చేసిన షర్మిల ఎన్నికల దగ్గర పడుతున్నాడంతో కూటమిని కూడా విమర్శిస్తున్నారు. అయితే షర్మిల ఇలా మాట్లాడటం వల్ల జగన్ కు మరికొంత పరపతి పెరుగుతుంది అని కాంగ్రెస్ సీనియర్ నేతలే భావిస్తున్నారని టాక్. ఇకనైనా షర్మిల తన తీరు మార్చుకుంటుందో లేదో చూడాలి.