విప్రో కు కొత్త సీఈఓ.. వేతనం ఎంతో తెలుసా?
ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రోకు కొత్త సీఈవోగా శ్రీనివాస్ పల్లియా నియమితులయ్యారు. థియరీ డెలాపోర్టే రాజీనామా అనంతరం కంపెనీ కొత్త సీఈఓగా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. వాస్తవానికి 2025 జులై వరకు డెలాపోర్టే పదవీకాలం ఉండగా, ఏడాదిముందే నిష్రమించారు. ఈ నేపథ్యంలో కొత్త సీఈఓగా పల్లియా బాధ్యతలు స్వీకరించారు.తాజాగా శ్రీనివాస్ వేతనం వివరాలు కంపెనీ సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్లో వెల్లడయ్యాయి. విప్రో కొత్త సీఈఓగా ఏడాదికి నగదు రూపంలో గరిష్టంగా 6 మిలియన్ డాలర్ల చొప్పున శ్రీనివాస్ పల్లియా వేతనం అందుకోనున్నారు. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.50 కోట్లు అన్నమాట. ఇందులో పల్లియా బీసిక్ వేతనం 1.75 మిలియన్ డాలర్ల నుంచి 3 డాలర్ల మధ్య ఉంటుంది. దీంతో పాటు వేరెబుల్పే రూపంలో 1.75 డాలర్ల నుంచి 3 మిలియన్ డాలర్ల మద్య పొందనున్నారు. కంపెనీ సాధించిన ప్రగతి ఆధారంగా ఈ చెల్లింపులు రానున్నాయి. అంటే కంపెనీ ఆదాయం, లాభం, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదం మేరకు ఈ చెల్లింపులు ఉంటాయి.