అమెరికాలో పోలీసు కాల్పులు... భారత సంతతి వ్యక్తి మృతి
మహిళపై దాడి కేసులో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను వాహనంతో గుద్దిన భారత సంతతికి చెందిన వ్యక్తి ఒకరు పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్ సాహూ(42) తన రూంమేట్ అయిన ఓ మహిళ(51)ను వాహనంతో ఢీకొట్టాడు. దీంతో, ఆమె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపైకి సాహూ బీఎండబ్ల్యూను నడిపాడు. ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. మరో పోలీసులు జరిపిన కాల్పుల్లో సాహూ ప్రాణాలు కోల్పోయాడు. కొంతకాలంగా సాహూ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు అని మాజీ భార్య లియా గోన్డ్స్టీన్ పేర్కొంది.
Tags :